కాలుష్యంతో కొవిడ్ మరణాలు పెరిగే ఛాన్స్!
దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురయ్యేవారిలో కొవిడ్-19తో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. 2.5 మైక్రాన్లు అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే ధూళికణాలతో ఏర్పడే కాలుష్యానికి గురవుతున్న 3089 కౌంటీలలో........
బోస్టన్: దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురయ్యేవారిలో కొవిడ్-19తో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. 2.5 మైక్రాన్లు అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే ధూళికణాలతో ఏర్పడే కాలుష్యానికి గురవుతున్న 3089 కౌంటీలలో ఈ అధ్యయనం జరిపారు. దీర్ఘకాలం నుంచి కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న కౌంటీల్లో కొవిడ్ మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు ‘జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్’లో తమ అధ్యయన ఫలితాల్ని ప్రచురించారు. ఇకనైనా వాయుకాలుష్య ప్రమాదాన్ని గుర్తించి విధాన రూపకర్తలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అయితే, కాలుష్యానికి.. కొవిడ్ మరణాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం స్పష్టంగా వివరించలేకపోయింది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించేందుకు సహకరించే ఏసీఈ-2 రిపెప్టార్ల ఉత్పత్తిని 2.5 పీఎం ధూళి కణాలు పెంచే అవకాశం ఉందని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అలాగే ఎక్కవ కాలం కాలుష్యానికి గురవ్వడం వల్ల శరీర రోగనిరోధక శక్తి సైతం తగ్గే అవకాశం ఉందని వివరించారు. ఈ రెండు కారణాల వల్ల కాలుష్య ప్రాంతాల్లో అధిక కొవిడ్ మరణాల రేటు నమోదవుతుండొచ్చని విశ్లేషించారు.
వయసు, వారసత్వం, పొగ తాగడం వంటి వ్యక్తిగత కారణాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపిన శాస్త్రవేత్తలు.. అధ్యయనంలో కొన్ని పరిమితులున్నట్లు వివరించారు. అయితే, తాజా అధ్యయనం ఆధారంగా మరింత లోతైన పరిశోధనలు జరిపేందుకు అవకాశం కలిగిందన్నారు. తద్వారా కొవిడ్ను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ