ఊపిరితిత్తులు కోలుకుంటున్నాయి!
కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి.
వాటంతట అవే సాధారణ స్థితికి..
దిల్లీ: కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఒకసారి వైరస్ సోకి.. ఆ తర్వాత నెగిటివ్గా నిర్ధారణ అయినా కూడా అవి పూర్తిగా కోలుకున్న ఛాయలు కనిపించడం లేదని తెలుస్తోంది. కొవిడ్ తరవాత ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై ఆస్ట్రియా పరిశోధకులు చేసిన అధ్యయనం సానుకూల సంకేతాలను ఇచ్చింది.
దాని ప్రకారం..కరోనా వైరస్ సోకి తీవ్రంగా ప్రభావితమైన 82 మంది వ్యక్తులు కోలుకున్న 6, 12, 24 వారాల తరవాత వారి కార్డియో-పల్మనరీకి జరిగిన నష్టంపై పరిశోధన జరిపారు. ఆరు వారాలు, 12 వారాల తరవాత ఆ కోలుకున్నవారి సిటీ స్కాన్ను పరిశీలించగా..ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తున్నట్లు గుర్తించారు. వైరస్ నుంచి బయటపడిన వారాల తరవాత ఊపిరితిత్తులు వాటంతట అవే మామూలు స్థితికి వచ్చే సామర్థ్యాన్ని చూపించినట్లు వెల్లడవుతోందన్నారు. వాటికి సంబంధించి సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంటే ఈ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు దోహదం చేస్తుందని, ఊపిరితిత్తుల సామర్థ్యం, కండరాల బలం, ఆందోళన తగ్గటం వంటి విషయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని వెల్లడించారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా ఊపిరితిత్తులకు నష్టం జరుగుతున్నందు వల్ల తాజా నిరూపణ అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుందని తెలిపారు. అయితే, ఈ అంశంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేశారు.
ఈ అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా మీడియాతో మాట్లాడారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా 20 నుంచి 30 శాతం కేసుల్లో ఊపిరితిత్తుల్లో మచ్చలు కనిపించాయన్నారు. కొన్ని కేసుల్లో మినహా శరీరానికి ఉన్న సహజమైన రోగ నిరోధకశక్తి కారణంగా వాటంతట అవే కోలుకుంటున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు