
ఊపిరితిత్తులు కోలుకుంటున్నాయి!
వాటంతట అవే సాధారణ స్థితికి..
దిల్లీ: కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఒకసారి వైరస్ సోకి.. ఆ తర్వాత నెగిటివ్గా నిర్ధారణ అయినా కూడా అవి పూర్తిగా కోలుకున్న ఛాయలు కనిపించడం లేదని తెలుస్తోంది. కొవిడ్ తరవాత ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై ఆస్ట్రియా పరిశోధకులు చేసిన అధ్యయనం సానుకూల సంకేతాలను ఇచ్చింది.
దాని ప్రకారం..కరోనా వైరస్ సోకి తీవ్రంగా ప్రభావితమైన 82 మంది వ్యక్తులు కోలుకున్న 6, 12, 24 వారాల తరవాత వారి కార్డియో-పల్మనరీకి జరిగిన నష్టంపై పరిశోధన జరిపారు. ఆరు వారాలు, 12 వారాల తరవాత ఆ కోలుకున్నవారి సిటీ స్కాన్ను పరిశీలించగా..ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తున్నట్లు గుర్తించారు. వైరస్ నుంచి బయటపడిన వారాల తరవాత ఊపిరితిత్తులు వాటంతట అవే మామూలు స్థితికి వచ్చే సామర్థ్యాన్ని చూపించినట్లు వెల్లడవుతోందన్నారు. వాటికి సంబంధించి సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంటే ఈ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు దోహదం చేస్తుందని, ఊపిరితిత్తుల సామర్థ్యం, కండరాల బలం, ఆందోళన తగ్గటం వంటి విషయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని వెల్లడించారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా ఊపిరితిత్తులకు నష్టం జరుగుతున్నందు వల్ల తాజా నిరూపణ అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుందని తెలిపారు. అయితే, ఈ అంశంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేశారు.
ఈ అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా మీడియాతో మాట్లాడారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా 20 నుంచి 30 శాతం కేసుల్లో ఊపిరితిత్తుల్లో మచ్చలు కనిపించాయన్నారు. కొన్ని కేసుల్లో మినహా శరీరానికి ఉన్న సహజమైన రోగ నిరోధకశక్తి కారణంగా వాటంతట అవే కోలుకుంటున్నాయని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: కట్టడి చేయలేకపోయారు.. కప్పు సాధించలేకపోయారు
-
Politics News
KTR: గ్యాస్ బండపై బాదుడు.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
-
India News
India Corona: అదుపులోనే మహమ్మారి.. కొత్త కేసులెన్నంటే..?
-
Business News
Stock Market Update: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Related-stories News
Hacking: ఆన్లైన్ మార్కెట్లో 100 కోట్ల మంది డేటా!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్ను నిలువరించిన వేళ..