లగ్జరీ కారులో ఇంటికి వెళ్లాలా నాయనా!
రోడ్డుపైన అలా వెళ్తుంటే ఓ లగ్జరీ కారు కనిపిస్తుంది. చూడగానే.. ‘అబ్బా ఎంత బాగుందో కారు. అలాంటి కారు మనకు లేదు కదా. కానీ అవకాశం వస్తే ఒక్కసారి అయినా అలాంటి కారును డ్రైవ్ చేయాలి.. అందులో ప్రయాణించాలి’ అని అనుకుంటాం..
జీఎంఆర్ ఇంటర్నేషనల్ వినూత్న ఆలోచన
హైదరాబాద్: రోడ్డుపైన అలా వెళ్తుంటే ఓ లగ్జరీ కారు కనిపిస్తుంది. చూడగానే.. ‘అబ్బా ఎంత బాగుందో కారు. అలాంటి కారు మనకు లేదు కదా. కానీ అవకాశం వస్తే ఒక్కసారి అయినా అలాంటి కారును డ్రైవ్ చేయాలి.. అందులో ప్రయాణించాలి’ అని అనుకుంటాం. సరిగ్గా అలాంటి వారి కోసం హైదరాబాద్ జీఎంఆర్ ఇంటర్నేషనల్ వినూత్న ఆలోచన చేసింది. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ)లో దిగగానే ఒక్క క్లిక్తో లగ్జరీ కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా ఓ సరికొత్త ఆలోచనకు జీఎంఆర్ ఇంటర్నేషనల్ శ్రీకారం చుట్టింది.
ఆర్జీఐఏలో విమానం దిగిన వెంటనే అత్యాధునిక, ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నట్లు జీఎంఆర్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. విమానాశ్రయం అరైవల్స్ వద్ద ఉన్న 4వీల్ సంస్థ లగ్జరీ కార్లను అద్దెకు అందిస్తోందని జీఎంఆర్ పేర్కొంది. పోర్షే, జాగ్వార్, లంబోర్గినీ, లెక్సస్, ఆడి, మెర్సిడెస్-బెంజ్ , బీఎండబ్ల్యూ, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫోర్డ్, వోల్వో, టయోటా,మారుతీ సుజుకీ లాంటి కంపెనీలకు చెందిన విలాసవంతమైన, లగ్జరీ కార్లను అద్దెకు ఇస్తుంది. ఈ కార్లను అద్దెకు తీసుకున్నవారు వాటిని తామే సొంతంగా నడుపుకోవచ్చు లేదా డ్రైవర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందే వీటిని బుక్ చేసుకోవచ్చని.. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ట్రిప్ తర్వాత కార్లును శానిటైజ్ చేస్తారని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట