MBNR-Vizag Train: మహబూబ్‌నగర్‌-విశాఖ రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (12862) రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జెండా ఊపి రైలును ప్రారంభించారు. 

Published : 20 May 2023 17:05 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (12862) రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్‌ కనెక్టివిటీ ఉండాలన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృధ్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్న ఆయన.. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లో ఆపాలని స్థానికులు కోరారని, ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని