రైస్ మిల్లుకు రూ.80 కోట్ల విద్యుత్ బిల్లు!
మహారాష్ట్రలో ఓ రైస్ మిల్లు యజమాని విద్యుత్తు బిల్లు ఇచ్చిన షాక్కు నిర్ఘాంతపోయాడు! ఇంతకీ వచ్చిన బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఎనభై కోట్ల రూపాయలు!! పాల్ఘర్కు చెందిన 66 ఏళ్ల గణపత్ నాయక్కు ఓ రైస్ మిల్లు ఉంది.
పాల్ఘర్: మహారాష్ట్రలో ఓ రైస్ మిల్లు యజమాని విద్యుత్తు బిల్లు ఇచ్చిన షాక్కు నిర్ఘాంతపోయాడు. ఇంతకీ వచ్చిన బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఎనభై కోట్ల రూపాయలు!! పాల్ఘర్కు చెందిన 66 ఏళ్ల గణపత్ నాయక్కు ఓ రైస్ మిల్లు ఉంది. ప్రతినెలా దానికి రూ.50 వేలకు కాస్త అటూఇటూ బిల్లు వచ్చేది. గత సోమవారం మాత్రం ఏకంగా రూ.80,13,89,600 బిల్లు ఆయన చేతికొచ్చింది. దిగ్భ్రాంతి చెందిన ఆయన అధికారులను ఆశ్రయించారు. మరుసటి రోజు మిల్లుకు వెళ్లి పరిశీలించిన అధికారులు.. రీడింగ్ తప్పు పడినట్లు గుర్తించారు. ఆపై బిల్లును రూ.80 వేలుగా సరిచేయడంతో గణపత్ నాయక్ ఊపిరి పీల్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!