సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం
బతికి ఉండగానే భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న భర్తలున్న రోజులివి. అలాంటిది ఒక భర్త కుటుంబాన్ని విడిచి పరలోకాలకు వెళ్లిపోయిన భార్యకు ఏకంగా మైనపు విగ్రహం చేయించారు. ఈ ఘటన కర్ణాకటలో
ఇంటర్నెట్ డెస్క్: బతికి ఉండగానే భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న భర్తలున్న రోజులివి. అలాంటిది ఒక భర్త కుటుంబాన్ని విడిచి పరలోకాలకు వెళ్లిపోయిన భార్యకు ఏకంగా మైనపు విగ్రహం చేయించారు. ఈ ఘటన కర్ణాకటలో జరిగింది. రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్యకు విగ్రహం చేయించారు. ఈ విగ్రహం వెనుక కథేంటంటే...
శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల శ్రీనివాస్ గుప్తా గృహ ప్రవేశం చేశారు. ఈ వేడుకలో తన భార్య లేని లోటు తెలియకూడదని ఆమె మైనపు విగ్రహం చేయించి... ఇంట్లో ఉంచారు. ఆ విగ్రహంతో కుటుంబ సభ్యులు ఫొటోలు దిగి మురిసిపోయారు. దిగువ ఫొటో అందులో ఒకటి.
రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే... నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు. జీవ కళ ఉట్టిపడుతున్న ఆ విగ్రహం గురించి ఎవరైనా చెప్తే గానీ తెలిసేలా లేదు. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో కదా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె