కళ్లకు గంతలతో బైక్ నడుపుతూ ప్రచారం
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రచార జోరు పెరిగింది. కొందరు వినూత్నంగా దూసుకెళుతుంటే మరికొందరు విడ్డూరాలకు పోతున్నారు. తమ నాయకుడిని గెలిపించాలంటూ ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకొని ద్విచక్రవాహనం నడుపుతూ....
చెన్నై: తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రచార జోరు పెరిగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి తమ నాయకుడిని గెలిపించాలంటూ కళ్లకు గంతలు కట్టుకొని ద్విచక్రవాహనం నడుపుతూ ప్రచారం నిర్వహించడం చర్చనీయాంశమైంది. తొండముత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్పీ వేలుమణిని గెలిపించాలంటూ యూఎంటీ రాజా అనే వ్యక్తి కళ్లకు గంతలతో ద్విచక్రవాహనం నడుపుతూ ప్రచారం నిర్వహించారు.
వేలుమణి ఫొటోను స్కూటీ ముందుభాగానికి అతికించుకొని అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారం చేపట్టాడు. ‘పదేళ్ల క్రితం కళ్లు తెరుచుకొని కూడా రోడ్ల మీద నడిచేందుకు తిప్పలు పడేవాళ్లం. కానీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో కళ్లకు గంతలు కట్టుకొని కూడా రోడ్లపై వాహనం నడపవచ్చు’ అని రాజా ప్రచారం నిర్వహిస్తున్నాడు. కళ్లకు గంతలతో బైక్ నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు రహదారులపై ఈ తరహా చర్యలు సరికావని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)