15ఏళ్ల వయసులో నేరం..68ఏళ్లు జైల్లోనే!
మనుషులు తెలిసీ తెలియని వయసులో చేసే కొన్ని తప్పులు.. జీవిత కాలం ప్రభావం చూపిస్తాయని అంటుంటారు. అలాంటి ఘటనే అమెరికాలో ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకుంది. జో లైగన్ అనే వ్యక్తి టీనేజీలో చేసిన నేరం..
వాషింగ్టన్: మనుషులు తెలిసీ తెలియని వయసులో చేసే కొన్ని తప్పులు.. జీవిత కాలం ప్రభావం చూపిస్తాయని అంటుంటారు. అలాంటి ఘటనే అమెరికాలో ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకుంది. జో లైగన్ అనే వ్యక్తి టీనేజీలో చేసిన నేరం కారణంగా 68ఏళ్ల పాటు జైలు జీవితాన్ని అనుభవించి.. అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం జైలు జీవితాన్ని అనుభవించిన వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తి గతవారమే జైలు నుంచి విడుదలై కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు.
అది 1953, ఫిబ్రవరి. అప్పుడు అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన జో లైగన్ వయసు 15 ఏళ్లు. తెలిసీ తెలియని ఆ వయసులో లైగన్ ఓ నేరానికి పాల్పడ్డాడు. మరో నలుగురు టీనేజీ కుర్రాళ్లతో కలిసి దోపిడీలో పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చాయి. వారి ముఠా చేసిన దోపిడీ ఘటన ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసింది. మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. దీంతో పోలీసులు లైగన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయస్థానం లైగన్కు జీవిత ఖైదు విధిస్తూ ఆదేశించింది. దీంతో లైగన్ 15ఏళ్ల వయసులోనే జైలు జీవితంలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జైలుకు వెళ్లిన ఆ వ్యక్తి ఇప్పుడు 83ఏళ్ల వయసులో విడుదలయ్యాడు.
లైగన్ విడుదలైన తర్వాత ఆయన తరపు న్యాయవాది బ్రిడ్జ్ మాట్లాడుతూ.. ‘1953లో నేరం చేసిన విషయంలో జైలు కెళ్లిన ఆ వ్యక్తి.. 83 ఏళ్ల వయసులో విడుదలయ్యాడు. అతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఇక ఎలాంటి ముప్పు లేదు. సమాజానికి అతడు చేసిన నష్టానికి తగిన రీతిలో తిరిగి చెల్లించుకున్నాడు. ఇప్పుడు లైగన్ తన జీవిత వృద్ధాప్య దశను స్వేచ్ఛగా జీవించవచ్చు. తొలుత 1970లో పెన్సిల్వేనియా గవర్నర్ నుంచి లైగన్కు క్షమాభిక్ష అవకాశం వచ్చింది. కానీ దాన్ని లైగన్ తిరస్కరించాడు. 2017లో వచ్చిన పెరోల్ అవకాశాన్ని తిరస్కరించాడు. ఆ విధంగా బయటకు వెళ్లడం ద్వారా తనకు స్వేచ్ఛ ఉండదని ఆయన నమ్మారు. అందుకే వాటిని తిరస్కరించారు’ అని బ్రిడ్జ్ వివరించారు.
బ్రిడ్జి గత దశాబ్దం కాలంగా లైగన్కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కేసును ఫెడరల్ కోర్టులో వాదించి 2021లో ఆయన్ను విడుదల చేయించడంలో కీలకపాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..