16 నెలల బకాయిలు చెల్లించండి: మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు
మాన్సాస్ ట్రస్టు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించారు. కార్యాలయం
విజయనగరం: మాన్సాస్ ట్రస్టు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీతాలు నిలిపివేయాలంటూ ఈవో బ్యాంకుకు లేఖ రాయడంతో వేతనాలు నిలిచిపోయాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 16 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు మాన్సాస్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, జీతాల కోసం మొదటిసారిగా ఆందోళన చేస్తున్నామని వాపోయారు. అడిగితే తనకేం తెలియదని ఈవో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్గజపతిరాజు ట్రస్ట్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవో జోక్యం పెరిగిందని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రస్టు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 13లోగా సమస్యలు పరిష్కరిస్తామని ట్రస్టు ఈవో హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా