కొవిడ్ కట్టడి: మాస్కు, వెంటిలేషన్ కీలకం!
భౌతిక దూరం కంటే మాస్కులు, సరైన వెంటిలేషన్తో గదులు, ఇండోర్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
భౌతిక దూరం కంటే వీటి ప్రభావమే ఎక్కువ
అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు, భౌతిక దూరం పాటించాలని అంతర్జాతీయంగా నిపుణులు సూచిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గది వాతావరణంలో గాలి ద్వారాను వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం కంటే మాస్కులు, సరైన వెంటిలేషన్తో గదులు, ఇండోర్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
సరైన వెంటిలేషన్ లేని గదుల్లో గాలిలోనూ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో గదులు, ఇండోర్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా నిపుణులు ఓ అధ్యయనం చేపట్టారు. పరిశోధనలో భాగంగా, ఓ క్లాస్ రూం మోడల్ను రూపొందించిన పరిశోధకులు.. అక్కడి వాతావరణంలో వైరస్ ప్రభావం ఎలా ఉందో కంప్యూటర్ విధానంలో పరీక్షించారు. ఇందుకోసం 9అడుగుల ఎత్తు, 709 చదరపు అడుగుల స్థలంలో తరగతి వాతావరణాన్ని రూపొందించి పరీక్ష జరిపారు. నాణ్యమైన మాస్కులు ధరించినట్లయితే ఆరు అడుగుల భౌతిక దూరం లేకున్నా ప్రమాదం ఏమీ లేదని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా వెంటిలేషన్ ఉన్న, వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో సూక్ష్మబిందువుల కదలికపై అధ్యయనాన్ని కొనసాగించారు. వెంటిలేషన్ లేని గదులతో పోలిస్తే..వెంటిలేషన్ ఉన్న గదుల్లో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 40 నుంచి 50శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాకు చెందిన నిపుణుడు మైఖేల్ కింజెల్ పేర్కొన్నారు.
మాస్కులు తప్పనిసరిగా ధరిస్తే పాఠశాలలు, ఇండోర్ గదుల్లో మూడు అడుగుల దూరం సరిపోతుందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఈ మధ్యే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజా పరిశోధన కూడా ఇదే విషయాన్ని ధ్రువపరుస్తోందని తాజా పరిశోధనలో పాల్గొన్న మైఖేల్ కింజెల్ గుర్తుచేశారు. మాస్కులు, వెంటిలేషన్తో వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చని.. పాఠశాలలు, కార్యాలయాల్లో భౌతిక దూరం నిబంధనను సడలించుకోవచ్చని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్