Telangana News: రూ.30వేల వేతనంతో పారామెడికల్ ఉద్యోగాలు.. రేపే నోటిఫికేషన్
కంటి వెలుగు రెండో విడత అమలు కోసం పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
హైదరాబాద్: కంటి వెలుగు రెండో విడత అమలు కోసం పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ద్వారా నియామకాలు చేపడతారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకోసం డిసెంబరు 1న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 5న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 7వ తేదీన మెరిట్ జాబితా ముసాయిదా విడుదల చేసి మరుసటి రోజు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి పదో తేదీన తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్లకు నెలకు రూ.30వేల వేతనం ఇస్తారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలు ఏర్పాటుచేయనున్నారు. జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు రెండో విడత ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్