మేడారంలో దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా

మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని జిల్లా వైద్యాధికారి

Published : 28 Feb 2021 00:57 IST

తాడ్వాయి: మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు. ఈ నెల 24న మొదలైన మేడారం చిన్నజాతర ఇవాళ్టితో ముగిసింది. గత నాలుగు రోజులుగా ఉద్యోగులు ఇద్దరూ విధుల్లో ఉన్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలందించే క్రమంలో ఉద్యోగులిద్దరూ అస్వస్థకు గురైనట్లు అప్పయ్య చెప్పారు. దీంతో వీరిద్దరికీ స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ఉద్యోగులను హోమ్ క్వారంటైన్‌కు తరలించామని వైద్యాధికారి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు