Manjamma Jogathi: నాడు యాచకురాలు.. నేడు పద్మశ్రీ గ్రహీత
కన్నవాళ్లు కాదని వెలివేశారు.. సమాజం ఛీ అని చీదరించుకుంది. కడుపు నింపుకోవడం కోసం చేయి చాచి యాచించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా ఆమె వెరవలేదు.
మంజమ్మ జోగతి జీవన ప్రయాణంలో సవాళ్లెన్నో..!
ఇంటర్నెట్డెస్క్: దేశ ప్రథమ పౌరుడి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునేందుకు వచ్చిన కళాకారిణి మంజమ్మ జోగతి.. రాష్ట్రపతికి దిష్టి తీసి ఆశీర్వదించారు. ఆ తర్వాత చిరునవ్వుతో తన అవార్డును స్వీకరించారు. కానీ ఆ నవ్వుల వెనుక ఎంతోమందికి తెలియని కష్టాల కడలి దాగి ఉంది. కన్నవాళ్లు ఆమెను కాదని వెలివేశారు.. సమాజం ఛీ అని చీదరించుకుంది. కడుపు నింపుకోవడం కోసం చేయి చాచి యాచించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా ఆమె వెరవలేదు.. కుంగిపోలేదు. అవమానాలను పంటి బిగువన భరించింది. ఆ ముళ్లబాటను దాటుకుంటూ ముందుకు సాగింది. తనలోని కళను బయటపెట్టి.. నేడు దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగింది.
ఇంట్లోకి రానివ్వలేదు..
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జన్మించిన మంజమ్మ జోగతి అసలు పేరు మంజునాథ శెట్టి. 10వ తరగతి వరకు చదువుకుంది. తనకు 15ఏళ్ల వయసప్పుడు తన శరీరంలో అనూహ్యమైన మార్పులను గమనించాడు మంజునాథ శెట్టి. తాను అబ్బాయి కాదు అమ్మాయి అని గుర్తించాడు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. కొడుకు అబ్బాయి కాదని తెలిసిన మంజునాథ అమ్మానాన్న ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. చేసేదేం లేక, అతడిని ‘జోగప్ప’గా మార్చారు. జోగప్ప అనేది అతి పురాతన హిజ్రాల వర్గం. వీరు దేవుడిని పెళ్లి చేసుకుని తమ జీవితాన్ని దేవుడికి అంకితమిస్తారు. అలా మంజునాథ శెట్టి కూడా దేవుడిని పెళ్లి చేసుకుని మంజమ్మ జోగతిగా మారింది. అయితే ఆ తర్వాత మంజమ్మను తన కుటుంబసభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు.
ఆత్మహత్య చేసుకోవాలనుకుని..
తాను హిజ్రా అని తెలియగానే కుటుంబసభ్యులు వెలివేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన మంజమ్మకు ఎక్కడా పని దొరకలేదు. దీంతో కడుపు నింపుకోవడం కోసం మిగతా హిజ్రాల మాదిరిగానే చీర కట్టుకుని వీధుల్లో యాచించింది. ఆ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఒక దశలో వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. కానీ ప్రతి మేఘానికి ఓ మెరుపు ఉంటుంది అన్నట్లుగా.. మంజమ్మ జీవితంలోనూ చీకట్లు చీల్చే వెలుగు ‘కళ’ రూపంలో వచ్చింది. అది ఆమెకు కొత్త జీవితాన్ని పరిచయం చేసింది.
ఓ తండ్రికొడుకుల సాయంతో తనలోని కళని గుర్తించిన మంజమ్మ.. కాలవ్వ జోగతి అనే కళాకారిణి వద్ద జోగతి నృత్యం నేర్చుకుంది. కాలవ్వ బృందంలో చేరి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. కాలవ్వ మరణం తర్వాత ఆ బృందానికి తానే నాయకత్వం వహించి జోగతి నృత్యానికి ప్రజాదరణ తీసుకొచ్చేందుకు కృషి చేసింది. 2010లో కర్ణాటక ప్రభుత్వం మంజమ్మను రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. 2019లో కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్గా అరుదైన గుర్తింపు సాధించింది.
రాష్ట్రపతికి దిష్టి తీసి..
ఆమె సేవను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ ఏడాది కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. పద్మ అవార్డు అందుకున్న రెండో ట్రాన్స్జెండర్ ఈమే కావడం విశేషం. అంతకుముందు 2019లో తమిళనాడుకు చెందిన ప్రముఖ డ్యాన్సర్ నర్తకి నటరాజ్ ఈ పురస్కారం అందుకున్న తొలి ట్రాన్స్జెండర్గా గుర్తింపు సాధించారు.
మంగళవారం జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో మంజమ్మ.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. అయితే తన పేరు పిలవగానే వినమ్రంగా సభకు, రాష్ట్రపతికి నమస్కరిస్తూ వెళ్లిన మంజమ్మ.. వేదికకు మొక్కి రాష్ట్రపతికి తన చీర కొంగుతో పలుమార్లు దిష్టి తీశారు. దీంతో సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!