Vishakhapatnam: మూగ జీవాలే ఆమెకు పిల్లలు..!
విశాఖపట్నం పెద్ద వాల్తేరు ప్రాంతంలో ఓ ఇరుకు వీధిలోకి మూగజీవాలు.. నిర్ణీత వేళకు బారులు తీరతాయి. ఇవన్నీ ప్రతిరోజు..
విశాఖపట్నం: విశాఖపట్నం పెద్ద వాల్తేరు ప్రాంతంలో ఓ ఇరుకు వీధిలోకి మూగజీవాలు.. నిర్ణీత వేళకు బారులు తీరతాయి. ఇవన్నీ ప్రతిరోజు.. ఒకే సమయంలో ఆ ఇంటి వద్దకు చేరతాయని పరిశీలించినవారికి మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని అదరించడమే పనిగా పెట్టుకుని వాటితోనే మమేకం అవుతున్నారు విశాఖకు చెందిన శాంతి. కష్టపడి సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం మూగజీవుల ఆహారం కోసమే ఆమె ఖర్చు చేస్తున్నారు.
వివాహం కూడా చేసుకోకుండా ఆ జీవులను శాంతి సాకుతున్నారు. కుట్టుపని చేసి సంపాదించే మొత్తాన్ని తన జీవనం కోసం కొద్దిగా ఉపయోగించుకొని.. మిగిలిన డబ్బును మూగజీవాల కోసమే వెచ్చిస్తున్నారు. వాటికి నిత్యం రెండు పూటలా ఆహారం అందిస్తున్నారు. ఆవులు, పిల్లులు, శునకాలు.. ఇలా తన ఇంటి వద్దకు వచ్చే మూగ జీవాలన్నిటికి ప్రత్యేకంగా పేర్లు పెట్టి పిలుచుకుంటారామె. ప్రతి రోజు ఉదయం.. ఆహారం కోసం ఓ సమయంలో శునకాలు, పిల్లులు వస్తే.. మరో సమయంలో ఆవులు ఆహారం కోసం వస్తాయి. సాయంత్రం సైతం ఈ మూగజీవాలు ఇక్కడికి వస్తాయి. నిత్యం వాటికి సమయానికి ఆహారం అందించడం కోసం శ్రమించడంలో ఆనందం పొందుతున్నట్టు ఆమె తెలిపాతరు. ఆ మూగ జీవులు ఒక్కరోజు కనిపించకపోయినా తట్టుకోలేనని ఆమె చెప్పారు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు