Big mouth: వామ్మో! సమంత నోరు ఎంత పెద్దదో!
టిక్టాక్ సామాన్య ప్రజల్ని సెలబ్రెటీలను చేయడమే కాదు.. ఒక మహిళనైతే ఏకంగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించేలా చేసింది. అమెరికాలోని కనెక్టికట్ చెందిన 31ఏళ్ల సమంతా రామ్స్డెల్.. ప్రపంచంలోనే అతిపెద్ద నోరు (6.52 సెంటీమీటర్లు)గల మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది.
టిక్టాక్తో గుర్తింపు
ప్రపంచంలోనే అతిపెద్ద నోరుగల మహిళగా గిన్నిస్ రికార్డు కైవసం
ఇంటర్నెట్ డెస్క్: టిక్టాక్ సామాన్య ప్రజల్ని సెలబ్రెటీలను చేయడమే కాదు.. ఒక మహిళనైతే ఏకంగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించేలా చేసింది. అమెరికాలోని కనెక్టికట్ చెందిన 31ఏళ్ల సమంత రామ్స్డెల్.. ప్రపంచంలోనే అతిపెద్ద నోరు (6.52 సెంటీమీటర్లు)గల మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది. గిన్నిస్ బుక్ పెద్దలు.. ఆమె నోటి కొలతలను డాక్టర్ ఎల్క్ చెయింగ్ డిజిటల్ క్యాలిపర్స్ సాయంతో కొలతలు తీసుకున్నారు. ఆపై జరిపిన పరిశీలన అనంతరం మహిళల్లో ఆమెదే అతి పెద్ద నోరు సమంతదేనని ప్రకటించారు. కేవలం నోటి ద్వారా గిన్నిస్లో సంపాదించేసింది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆమెకి ఇదంతా ఎలా సాధ్యమైందో ఇక మీరు చదివేయండి..
లోపాన్నే ప్రేమించా..
ఇప్పుడైతే.. నెటిజన్లు ఆమె ప్రత్యేకతను గుర్తించి ప్రశంస్తిస్తున్నారు కానీ ఆమెని చిన్నప్పుడు పలకరిస్తే.. తోటి స్నేహితుల నుంచి వెక్కిరింతలు, హేళన మాత్రమే కనిపించేదట. ఇదే విషయాన్ని తన మాటల్లో చెబుతూ.. ‘‘చిన్నప్పుడు నా నోటి చూసి నాతోటి పిల్లలు వెక్కిరించేవారు. అయినా సరే.. ఇది నాలో లోపంగా భావించలేదు. ఏ లోపాన్నైతే ఎత్తిచూపారో..దాన్నే ప్రేమించడం ప్రారంభించా. ఇప్పుడు ఇదే అందరికీ స్ఫూర్తిగా నిలవడం ఆదర్శంగా ఉంది. మీ అందరికీ నేనిచ్చే సలహా ఒకటే.. మీ శరీరంలో ఏదైనా అవయవంలో లోపం ఉన్నా, చిన్నచూపుగా భావించకండి ఆ అవయవంతోనే వైవిధ్యంగా చూపించడానికి మీ వంతు ప్రయత్నించండి. సిగ్గుపడొద్దు. గర్వంగా చేయండి. అదే మీకు పెద్ద ఆస్తిగా నిలుస్తుంది. అదే మీకు శక్తి కూడా. గతేడాది కరోనా వేళ టిక్ టాక్లో వీడియోలు చేయడం ప్రారంభించా. అందులో నా ఎంట్రీ ఆలస్యమైనప్పటికీ ..ఇప్పుడు దాంతోనే సమయం గడుపుతూ నన్ను బిజీ చేసుకున్నా. సృజనాత్మకంగా ఉండే వీడియోలు అప్లోప్ చేసేదాన్ని. కొన్ని కామెడీ, మరికొన్ని పాటలు పాడటం.. ఇలా అనమాట. ఒక కామెడీ వీడియో అయితే వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్లతో చేశా. అంతే అది చూసి చిన్నారులంతా.. ‘‘ నీ ముఖానికి ఏమైంది’’ అంటూ కామెంట్లు పెట్టేవారు. నాలో ఏది చూసి హేళన చేశారో.. అదే ఇప్పుడు నాకు గుర్తింపు తెచ్చేలా చేసింది. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి 12లక్షల మంది ఫాలోవర్స్ ఉండటమూ గర్వంగా ఉంది.
మా ఇంట్లో ఎవరికీ పెద్దనోరు లేదు..
మా కుటుంబంలో ఇంత పెద్ద నోరు ఎవరికీ లేదు. నా నోరు మాత్రమే ఇంత పెద్దగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక ఆపిల్ లేదా బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ని అమాంతం నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తా.
* ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యూట్యూబ్ వేదికగా పంచుకుంది. ప్రపంచంలో అతి పెద్ద నోరుగల మహిళగా గిన్నెస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించేసుకున్న సమంత.. పురుషుల్లో గిన్నెస్ వరల్డ్ రికార్డు కొల్లగొట్టిన ఐసాక్ జాన్సాన్తోనూ జోడీకట్టి వీడియోలు చేసింది. సరదాగా చేసిన టిక్టాక్ ఆమెకు గుర్తింపునివ్వడంతో హాస్యం పండించే కళాకారిణిగా పేరు తెచ్చుకుంటానని చెప్పేస్తుంది. ప్రపంచంలో ఎందరో హాస్యనటులు, గాయకులు ఉన్నా.. తన నోటితో ప్రపంచానికి పరిచయమవుతానని ఎన్నడూ ఊహించలేనని చెబుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!