మురికి వీరుడు.. 65ఏళ్లుగా స్నానం చేయలేదట!
ప్రపంచంలో సాధారణ మానవుల జీవన శైలికి పూర్తి విభిన్నంగా జీవించే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఉదాహరణకు ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రోగ్రాంలో కనిపించే సాహస వీరుడు బేర్ గ్రిల్స్ ఎవరూ ఊహించని విధంగా వింతగా తన జీవితాన్ని గడిపే
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచంలో సాధారణ మానవుల జీవన శైలికి పూర్తి విభిన్నంగా జీవించే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఉదాహరణకు ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రోగ్రాంలో కనిపించే సాహస వీరుడు బేర్ గ్రిల్స్ ఎవరూ ఊహించని విధంగా వింతగా తన జీవితాన్ని గడిపే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇరాన్లోనూ ఓ వింత మనిషి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. దాదాపు 65 ఏళ్లుగా స్నానం చేయకుండా ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అతడి జీవన శైలీ సాధారణ మనుషులకు పూర్తి విభిన్నంగా ఉండటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. అమౌ హాజి అనే 83 ఏళ్ల వృద్ధుడు ఇరాన్లోని ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ వృద్ధుడు దాదాపు 65 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. దీంతో ఇతడు ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా చరిత్ర సృష్టించాడు. తాను స్నానం చేయకపోవడానికి గల కారణాలపై హాజి స్పందిస్తూ.. ‘నాకు నీరు అంటే భయం. అందుకే 65 ఏళ్లుగా స్నానం చేయలేదు’ అని చెప్పారు. అంతేకాకుండా తనకు స్నానం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడతాననే భావన కూడా ఉందని చెప్పాడు.
ఎడారి ప్రాంతంలో ఒంటరిగా నివసించే హాజికి మాంసాహారం అంటే ఎంతో ఇష్టం. పోర్కుపైన్ మాంసాన్ని ఇష్టంగా తింటానని హాజి తెలిపాడు. ఆయనకు ఇంట్లో చేసిన వంట అంటే నచ్చవని చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా తాను ఇలా మురికిగానే జీవిస్తున్నానని చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హాజి అంత మురికిగా ఉన్నప్పటికీ అతడికి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాధులు సోకలేదు. అమౌకు సిగరెట్ తాగడం అంటే ఇష్టం. గ్రామస్థులు తనకు సిగరెట్లు ఇచ్చినప్పటికీ.. అవి అయిపోయాక అమౌ పొగాకు బదులుగా జంతువుల పేడను ఉపయోగిస్తాడని గ్రామస్థులు చెబుతున్నారు. హాజికి ఇళ్లు లేదు.. ఎడారి ప్రాంతంలోనే గుంతలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. సమీప గ్రామస్థులు అతడికి ఓ గుడిసె నిర్మించి ఇచ్చినా.. అందులో ఉండేందుకు అతడు ఆసక్తి చూపలేదు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్