Polavaram: జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం

కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై దిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో..

Published : 17 May 2022 17:07 IST

దిల్లీ: కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై దిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు, డయాఫ్రం వాల్‌పై చర్చిస్తున్నారు. ఏపీ రాష్ట్ర అధికారులు, ఐఐటీ నిపుణులు, సీడబ్ల్యూసీ అధికారులు భేటీలో పాల్గొన్నారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, సీడబ్ల్యూసీ అధికారులు సమర్పించిన నివేదికలపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ అంశాలపై నేటి సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపు కూడా సమావేశం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సాంకేతికేతర అంశాలపై రేపు జల్‌శక్తి శాఖ కార్యదర్శితో సమావేశం జరగనుంది. రేపటి భేటీలో సాంకేతిక అంశాలపై నిర్ణయాలు, సాంకేతికేతర పెండింగ్‌ అంశాలపై చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని