Mekapati Goutham Reddy: మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల క్రతువు ప్రారంభం

ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల క్రతువు ప్రారంభమైంది.

Updated : 23 Feb 2022 12:22 IST

ఉదయగిరి: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల క్రతువు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు కృష్ణార్జునరెడ్డి, కుమార్తె సాయి అనన్య.. గౌతమ్‌రెడ్డి తరహాలోనే దుస్తులు ధరించారు. మంత్రి చివరిచూపు కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంతకుముందు నెల్లూరులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి వరకు సాగింది. ఈ యాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా ప్రజలు, అభిమానులు కన్నీటితో వీడ్కోలు పలికారు. 

ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్‌ కళాశాల(మెరిట్స్‌) సమీపంలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు