Mekapati Goutham Reddy: రేపు నెల్లూరు జిల్లాకు భౌతికకాయం.. ఎల్లుండి స్వగ్రామంలో అంత్యక్రియలు!

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటులో ఈ ఉదయం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికాలో

Updated : 21 Feb 2022 12:24 IST

హైదరాబాద్‌: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటులో ఈ ఉదయం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు అర్జున్‌రెడ్డి అక్కడి నుంచి బయల్దేరారు. రేపు ఉదయం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. బుధవారం నెల్లూరు జిల్లా బ్రహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు అపోలో ఆస్పత్రి నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తీసుకెళ్లారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఈ సాయంత్రం వరకు అక్కడే ఉంచనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి గౌతమ్‌రెడ్డి పార్ధీవదేహాన్ని తరలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని