వ్యక్తిగత పరిశుభ్రతపై 2.5లక్షల మంది బాలికలకు అవగాహన
దేశంలోని చాలా మంది మహిళలకు నెలసరిపై కచ్చితమైన అవగాహన లేదనే చెప్పవచ్చు. అనేకమంది ఇప్పటికీ సరైన న్యాప్కిన్లు
ముంబయి: దేశంలోని చాలా మంది మహిళలకు నెలసరి, తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘నైన్ హైజీన్ అండ్ పర్సనల్ కేర్’ సంస్థ ఓ బృహత్తర కార్యక్రమానిక చేపట్టింది. మే 28న రుతుక్రమ ఆరోగ్యం-పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని.. గడిచిన నెలరోజుల వ్యవధిలో 8 రాష్ట్రాల్లోని 2.5 లక్షల మంది బాలికలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. 7.5 లక్షల మంది మహిళలకు నెలసరి సమయంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించింది. సంస్థకు చెందిన స్వయం సహాయక బృందాలు గ్రామాల్లోని ప్రజల వద్దకు చేరుకొని రుతుక్రమంపై చర్చించడం, దానిచుట్టూ ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది.
తాము చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడం పట్ట సంస్థ వ్యవస్థాపకుడు అమర్ తుల్సియన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇంత తక్కువ సమయంలో 2.5 లక్షల మంది బాలికల వద్దకు చేరుకొని వారికి అవగాహన కల్పించడం అసాధారణమై విషయం. కానీ, మా బృందాలు దాన్ని సాధ్యం చేసి చూపాయి. రుతుచక్రం ప్రారంభం అనేది స్త్రీలలో జీవసంబంధమైన మార్పులలో ఒకటి. దానిపై వారికి అవసరమైన అవగాహన కల్పించటంతో పాటు, శానిటరీ న్యాప్కిన్లను అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే శక్తిని అందిస్తున్నాం. నెలసరి ఆరోగ్యం, పరిశుభ్రత ప్రతి మహిళకు అందుబాటులో ఉండేలా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాము. ’ అని అమర్ తుల్సియన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే