Mercedes Benz: ఆటో ఎక్కిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో.. పోస్ట్ వైరల్
విలాసవంత కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా(Mercedes Benz India) సీఈవోకు పుణె(Pune)లో ఒక కొత్త అనుభవం ఎదురైంది! ట్రాఫిక్ సమస్య(Traffic Jam) కారణంగా ఆయన తన బెంజ్ కారు దిగి...
ఇంటర్నెట్ డెస్క్: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా(Mercedes Benz India) సీఈవోకు పుణె(Pune)లో కొత్త అనుభవం ఎదురైంది! ట్రాఫిక్ సమస్య(Traffic Jam) కారణంగా ఆయన తన బెంజ్ కారు దిగి, సాధారణ ప్రయాణికుడిలా ఓ ఆటోలో గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే, అంతకుముందు ఆయన పుణె రోడ్లపై కొన్ని కిలోమీటర్లు నడవడం గమనార్హం. ఆటోలో ప్రయాణిస్తున్నప్పటి ఓ ఫొటోను ఆయన తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది కాస్త నెట్టింట వైరల్గా మారింది.
‘మెర్సిడెస్ బెంజ్’ ఇండియా సీఈవో మార్టిన్ ష్వెంక్ గురువారం రాత్రి పుణెలో తన ఎస్-క్లాస్ కారులో ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఎంతకూ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో చేసేదేమీ లేక రోడ్డుపై నడక మొదలుపెట్టారు. ఇలా కొన్ని కిలోమీటర్లు నడిచి.. ఓ ఆటో పట్టుకుని, గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇదంతా ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వివరించారు. ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘మీ ఎస్-క్లాస్ బెంజ్ కారు పుణె రోడ్లపై ట్రాఫిక్లో చిక్కుకుపోయినప్పుడు ఏం చేస్తారు? బహుశా కారు దిగి, కొన్ని కిలోమీటర్లు నడిచి, ఆపై రిక్షా పట్టుకుంటారా?’ అని క్యాప్షన్ పెట్టారు.
ఇది అభినందించదగ్గ విషయమంటూ ఈ పోస్ట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రాఫిక్లో చిక్కుకుపోయిన సమయంలో ప్రజారవాణా వ్యవస్థ ఏ విధంగా ఆదుకుంటుందో పలువురు వివరించారు. ఆటో డ్రైవర్.. మీటర్ ప్రకారమే ఛార్జ్ చేశాడు కదా? అని ఒకరు కామెంట్ పెట్టారు. ఇది చూస్తుంటే.. ‘గజిని’ సినిమాలో తన ప్రియురాలిని చూసేందుకు ఆమిర్ ఖాన్ ఆటోలో ప్రయాణించే సీన్ గుర్తొస్తుందంటూ ఒకరు స్పందించారు. పరిస్థితులకు తగినట్లు ఎలా నడచుకోవాలో నేర్పారంటూ ఒకరు కామెంట్ పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?