Raghurama: ఆ నంబ‌ర్ నుంచి ఐఏఎస్‌కు మెసేజ్‌లు

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ పేరిట త‌న‌కు సందేశాలు వ‌స్తున్నాయ‌ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేశ్ ట్వీట్ చేశారు. 9000911111 నంబ‌ర్ నుంచి త‌న‌తో పాటు త‌న బంధువుల‌కు మెసేజ్‌లు

Published : 05 Jun 2021 15:39 IST

అమ‌రావ‌తి: నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు పేరిట త‌న‌కు సందేశాలు వ‌స్తున్నాయ‌ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేశ్ ట్వీట్ చేశారు. 9000911111 నంబ‌ర్ నుంచి త‌న‌తో పాటు త‌న బంధువుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నం కోసం ఈ స‌మాచారం పంచుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. పీవీ ర‌మేశ్ ట్వీట్‌పై ఎంపీ ర‌ఘురామ‌రాజు స్పందించారు.

త‌న మొబైల్‌ను మే 14న సీఐడీ పోలీసులు అన‌ధికారికంగా సీజ్ చేశార‌ని.. ట్విట‌ర్‌లో స‌మాధాన‌మిచ్చారు. త‌న ఫోన్ సీఐడీ అధికారుల వ‌ద్దే ఉంద‌ని.. తిరిగి ఇవ్వాల‌ని లీగ‌ల్ నోటీస్ ఇచ్చిన‌ట్లు ర‌ఘురామ‌కృష్ణరాజు పేర్కొన్నారు. మే 14 నుంచి జూన్ 1 వ‌ర‌కు ఆ నెంబ‌ర్ నుంచి తాను ఎవ‌రికీ మెసేజ్‌లు పంప‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగు రోజుల కిందట ఆ సిమ్ బ్లాక్ చేసి కొత్త‌ది తీసుకున్న‌ట్లు వివరించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి త‌న ఫోన్ నెంబ‌ర్‌ను దుర్వినియోగం చేసిన‌ట్ల‌యితే సీఐడీ అద‌న‌పు డీజీ సునీల్ కుమార్‌తో పాటు ఇత‌రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ర‌ఘురామ తెలిపారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని