- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
అంగారకుడిపై జీవం ఉండే అవకాశం..
కొంతకాలం సజీవంగా సూక్ష్మజీవులు
బెర్లిన్: భూమిపై ఉన్న కొన్ని రకాల సూక్ష్మజీవులు అంగారకుడిపై జీవించే అవకాశాలున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇటీవల దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలు ఫ్రంటైర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై జీవం నిలిచి ఉంటుందా లేదా అన్న అంశంపై వీరు పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో మనం ఎక్కువగా అంగారకుడిపైకి ప్రయోగాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా పరిస్థితులను కృత్రిమంగా నెలకొల్పి ఈ పరిశోధనలు నిర్వహించినట్లు పరిశోధకులు వెల్లడించారు. భూమి స్ట్రాటో ఆవరణంలో అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులను కల్పించి ఈ పరిశోధనలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు. కొన్ని రకాల ఫంగస్ల నుంచి సేకరించిన సూక్ష్మజీవులు యూవీ రేడియేషన్ను దాటుకొని జీవించగలిగాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన మార్టా ఫిలిపా కార్టెసావ్ పేర్కొన్నారు. ‘‘అంగారకునిపై జీవం ఎలా ఉంటుందో పరిశీలించకపోతే అక్కడికి వెళ్లే వ్యోమగాములు ప్రమాదంలో పడతారు. ఇతర గ్రహాలపై జీవం పెరగాలన్నా, ఆహారం తయారవ్వాలన్నా సూక్ష్మజీవులే కీలకం. మనలాగే సూక్ష్మజీవులు కూడా.’’ అని మరో పరిశోధకురాలు కాథరీనా సెయిమ్స్ అన్నారు.
రెండు బుడగల్లో అంగారక గ్రహంపై పరిస్థితులు, ఉష్ణోగ్రతలు కృత్రిమంగా సృష్టించి సూక్ష్మజీవులను అందులో ప్రవేశపెట్టామని పరిశోధకులు వెల్లడించారు. ఒక బుడగను రేడియేషన్ను తట్టుకొనేలా, మరొకటి సాధారణంగా తయారుచేసి భూమి స్ట్రాటో ఆవరణలో ప్రవేశపెట్టినట్లు వారు తెలిపారు. రేడియేషన్ ద్వారా ఇవి వెళ్లినపుడు వాటిలో వచ్చే మార్పులను అధ్యయనం చేశామన్నారు. అన్ని పరిస్థితుల్లో ఇవి ఏ విధంగా స్పందిస్తున్నాయో పరిశీలించామని వారు తెలిపారు. ఈ ప్రయోగంలో పరీక్షించిన అన్ని సూక్ష్మజీవుల్లో ఆస్పెర్గిల్లస్ నైగర్ అనే ఒక రకమైన సూక్ష్మజీవులు మాత్రమే సజీవంగా ఉన్నట్టు గుర్తించామని వారు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్కే ఎక్కువ అవకాశాలు..!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Crime News: బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Social Look: పారిస్ ప్రేమలో మెహరీన్.. ట్రెండ్ ఫాలో అయిన ప్రియా ప్రకాశ్!