Andhra News: జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం: మంత్రి బొత్స

రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Published : 08 Jun 2023 18:25 IST

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈనెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్‌.. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్‌లను అందజేస్తారని తెలిపారు. సుమారు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్‌లు ఇస్తున్నట్టు చెప్పారు. టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సీఎం చేతుల మీదుగా సత్కరిస్తామన్నారు.

విద్యా కానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. అలాగే ఈనెల 28న నాలుగో విడత అమ్మఒడి నిధులను సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. మొదటి దశలో 12వేల పాఠశాలల్లో సాంకేతికత ద్వారా విద్య అందిస్తామన్నారు. రాష్ట్రంలో గోరు ముద్ద ద్వారా మంచి భోజనం అందిస్తున్నామని బొత్స వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని