Harish Rao: దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు: మంత్రి హరీశ్
రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. దీని ద్వారా తెలంగాణలో 1200 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్ననట్లు వెల్లడించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. దీని ద్వారా తెలంగాణలో 1200 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్ననట్లు వెల్లడించారు. బి కేటగిరి సీట్లలో 85% స్థానికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మెడికల్ కాలేజీలు వస్తాయని ఉద్యమ సమయంలో మాట్లాడుకున్న కల ఇప్పుడు నిజమవుతోంది. సమైక్య రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్,ఆదిలాబాద్లలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. భవిష్యత్తులో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం.
ఈ ఒక్క ఏడాదే 8 కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేశాం. తెలంగాణ ఏర్పడేనాటికి 850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2052 సీట్లు పెరిగాయి. మన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, చైనాకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? సీట్లు పెరిగితే మన విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరముండదు. రాష్ట్రానికి కేంద్రం వైద్య కళాశాలలు మంజూరు చేయట్లేదు. దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు’’ అని హరీశ్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం