Harish Rao: త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

కేంద్రం అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Updated : 13 Nov 2022 12:19 IST

సిద్దిపేట: కేంద్రం అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. యువత జీవితాల్ని నాశనం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయన్నారు. సిద్దిపేటలో కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్నవారికి పాలు, పండ్లను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రంలో గ్రూప్‌ - 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 17వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ఆ శాఖలోనే మరో 2 వేల పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.  95శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు హరీశ్‌రావు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని