Telangana news: బీబీ నగర్ ఎయిమ్స్లో వైద్య సేవలపై మంత్రి హరీశ్రావు అసంతృప్తి
బీబీ నగర్ ఎయిమ్స్ని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అక్కడ అందుతున్న వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: బీబీ నగర్ ఎయిమ్స్ని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అక్కడ అందుతున్న వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి పలుమార్లు ఆస్పత్రిని సందర్శించారే తప్ప సదుపాయాల గురించి ఎప్పుడూ కేంద్రాన్ని అడగలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వమే ముందుకు వచ్చి బీబీ నగర్లో ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించినా ప్రజలకు ఉపయోగం కలగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కేవలం 20 మంది ఇన్పేషెంట్లు మాత్రమే ఉండటాన్ని గమనించిన మంత్రి.. ఎయిమ్స్ లాంటి పెద్దాస్పత్రిలో ఇంత తక్కువ సంఖ్యలో రోగులు ఉండటం దారుణమన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు సైతం ఎయిమ్స్లో క్లినికల్ ప్రాక్టీస్ చేయలేక యాదాద్రి జిల్లా ఆస్పత్రికి వెళ్లి ప్రాక్టీసు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రి పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పిన హరీశ్రావు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ అభివృద్ధి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు