Rosaiah:విపక్షాలను సైతం మెప్పించే నేర్పరితనం ఆయన సొంతం: హరీశ్‌ రావు

రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న నేతగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గుర్తింపు పొందారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Updated : 04 Dec 2021 16:56 IST

హైదరాబాద్‌: రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న నేతగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గుర్తింపు పొందారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. విపక్షాలను సైతం మెప్పించే నేర్పరితనం ఆయన సొంతమని చెప్పారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసంలో  హరీశ్‌ రావు నివాళులు అర్పించారు. రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది నేతల మాదిరిగానే రోశయ్యతో తనకూ చాలా దగ్గరి అనుబంధం ఉండేదన్నారు. శాసనసభలో 15 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కుతుందని తెలిపారు. పనిచేసిన అందరు ముఖ్యమంత్రుల వద్దా ఆయన మెప్పు పొందారని చెప్పారు. స్వపక్షం సహా విపక్షంలోనూ మిత్రులను సంపాదించుకున్న అరుదైన నేతగా ఆయన గుర్తింపు పొందారని వివరించారు. 2004లో.. తాను మంత్రిగా పనిచేసిన సమయంలో రోశయ్య తనను భుజం తట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. 

Read latest Political News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని