KTR: రాష్ట్రంలో కైటెక్స్ పెట్టుబడి.. ప్రత్యక్షంగా 22వేల మందికి ఉపాధి: కేటీఆర్
ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ కైటెక్స్ గ్రూపు కేరళ బయట విస్తరణ కోసం చూస్తున్నప్పుడు తాము సంప్రదించామని .....
హైదరాబాద్: ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ కైటెక్స్ గ్రూపు కేరళ బయట విస్తరణ కోసం చూస్తున్నప్పుడు ఆ సంస్థను తాము సంప్రదించామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ నెలకొల్పాలంటూ కైటెక్స్కు వివిధ ప్రభుత్వాల నుంచి వినతులు, హామీలు వచ్చాయని.. అయితే, తెలంగాణ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆ ప్రతినిధులను ఇక్కడకు రప్పించినట్టు చెప్పారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కైటెక్స్ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్రంలో తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తంచేసిన ఆ సంస్థ.. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు గతంలోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఎంవోయూ కుదిరింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కైటెక్స్కు కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లా చందన్పల్లిలో కాకతీయ టెక్స్టైల్ పార్కులో పరిశ్రమ ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధమైంది. రూ. 2400 కోట్లపెట్టుబడి పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ పరిశ్రమతో 22వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ పరిశ్రమలో 85 నుంచి 90శాతం మహిళలకు ఉపాధి దొరుకుతుంది. లక్షల ఎకరాల్లో పండే పత్తిని కైటెక్స్ కొనుగోలు చేయనుంది. కైటెక్స్తో 18వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీఎస్ఆర్ కింద రూ.6కోట్ల విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్ ఇవ్వనుంది. కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!