KTR: రాష్ట్ర విభజనతో రెండుగా విడిపోయి ఉండవచ్చు.. కానీ!: కేటీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి నిన్న వెళ్లినట్లు.. ఏపీ నుంచి వచ్చిన సోదరుల ప్రేమతో పొంగిపోయా...

Updated : 12 Feb 2022 11:44 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి నిన్న వెళ్లినట్లు.. ఏపీ నుంచి వచ్చిన సోదరుల ప్రేమతో పొంగిపోయా అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘‘రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయి ఉండవచ్చు. తెలంగాణ, ఏపీ మధ్య వ్యక్తిగతంగా ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

బొత్స కుమారుడు సందీప్‌ వివాహం వ్యాపారవేత్త కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితతో శుక్రవారం జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్‌ దంపతులు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తదితర ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు