Telangana News: ‘టెట్‌’ వాయిదా కుదరదు: మంత్రి సబిత

తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.

Published : 21 May 2022 14:24 IST

హైదరాబాద్: తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో కేటీఆర్‌ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫార్వర్డ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సబిత స్పందిస్తూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో టెట్‌ వాయిదా కుదరదు. అన్ని అంశాలను, ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్నాకే టెట్‌ పరీక్షపై నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు. కాగా జూన్‌ 12న తెలంగాణలో టెట్‌ పరీక్ష జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని