Telangana News: మహబూబ్నగర్లో ఫ్రీడం ఫర్ ర్యాలీ.. గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్లో నిర్వహించిన ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానం నుంచి
మహబూబ్నగర్: మహబూబ్నగర్లో నిర్వహించిన ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్టవర్ వరకు ఇవాళ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్ ర్యాలీ చేపట్టింది. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నేతలు, అధికారుల ప్రసంగాల అనంతరం.. ర్యాలీ ప్రారంభించే సందర్భంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ చేతిలోని తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడం పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. మంత్రికి తుపాకి ఇచ్చిన కానిస్టేబుల్ ఎవరు? అందులో ఉన్నది డమ్మీ బుల్లెట్టా, ఉత్సవాల సందర్భంగా కాల్పులు జరిపే బుల్లెట్టా అనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
రబ్బర్ బుల్లెట్ పేల్చా: మంత్రి శ్రీనివాస్గౌడ్
గన్ వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. ‘‘ నేను పేల్చింది రబ్బర్ బుల్లెట్ గన్. ఫ్రీడం ఫర్ ర్యాలీ ప్రారంభోత్సవం కోసం జిల్లా ఎస్పీ స్వయంగా ఇచ్చిన రబ్బర్ బుల్లెట్ గన్తో పేల్చాను. పోలీసుల తుపాకి లాక్కొని కాలిస్తే ఊరుకుంటారా? గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవానికి రబ్బర్గన్ పేల్చా. నేను ఆలిండియా రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని. గన్కు సంబంధించిన నిబంధనలన్నీ నాకు తెలుసు’’ అని శ్రీనివాస్గౌడ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్