PRC: సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం.. కాసేపట్లో మీడియా ముందుకు
పీఆర్సీ సాధన సమితి సభ్యులతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి 7 గంటల పాటు చర్చలు జరిగాయి.
అమరావతి: పీఆర్సీ సాధన సమితి సభ్యులతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి 7 గంటల పాటు చర్చలు జరిగాయి. హెచ్ఆర్ఏ స్లాబుల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్టు తెలుస్తోంది. మంత్రులతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం ఆన్లైన్లో మాట్లాడారు. హెచ్ఆర్ఏ స్లాబులతో పాటు కొన్ని అంశాలపై అంగీకారం కుదిరినట్టు సమాచారం. మంత్రుల కమిటీతో కుదిరిన ఒప్పందం మేరకు ఉద్యోగ సంఘాలు సమ్మె నిర్ణయం ఉపసంహరించుకోనున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.
చర్చల్లో మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పేర్ని నానితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరఫున పీఆర్సీ సాధన కమిటీ సభ్యులు బండి శ్రీనివాసరావు, కె.ఆర్.సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు