Kishan reddy: విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వల్పగాయం

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించారు. జన ఆశీర్వాద సభ ముగించుకుని బయల్దేరుతున్న సమయంలో ఆయనకు స్వల్ప గాయమైంది

Updated : 24 Sep 2022 17:04 IST

విజయవాడ: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించారు. జన ఆశీర్వాద సభ ముగించుకుని బయల్దేరుతున్న సమయంలో ఆయనకు స్వల్ప గాయమైంది. కారు ఎక్కుతుండగా కిషన్‌రెడ్డి తలకు కారు డోర్‌ తగిలి గాయపడ్డారు.

సీఎం జగన్‌ను కలిసిన కిషన్‌రెడ్డి

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో కిషన్‌రెడ్డికి అధికారులు స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని