Mask must: రోడ్డుపై కారు ఆపి మాస్కులు పంచిపెట్టిన సీఎం.. వీడియో
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వినూత్న నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.....
చెన్నై: తమిళనాడులో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వినూత్న నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఆయన తాజాగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో చెన్నై వీధుల్లో తన కాన్వాయ్ని ఆపి మాస్కుల్లేకుండా తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి మాస్కులు పంచి పెట్టారు. ఈ వీడియోని ఆయన ట్విటర్లో పంచుకున్నారు. హెడ్ క్వార్డర్స్ నుంచి క్యాంప్ ఆఫీస్కు వస్తున్న దారిలో కొందరు మాస్కుల్లేకుండా బహిరంగంగా తిరగడం గమనించానన్న స్టాలిన్.. వారికి మాస్కులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు వ్యాక్సిన్ వేయించుకోవడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్