MLC Bhageeratha Reddy: వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు, వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) కన్నుమూశారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Published : 02 Nov 2022 17:15 IST

కర్నూలు: చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు, వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) కన్నుమూశారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. నంద్యాల జిల్లా అవుకులోని తన స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఊపిరితిత్తుల్లో   రక్తస్రావం అవుతుండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా అవుకులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని