Corona virus: ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్‌

తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. స్వల్ప జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా నివేదికలో

Updated : 12 Sep 2022 18:27 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. స్వల్ప జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా నివేదికలో పాజిటివ్‌గా తేలినట్టు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. గత రెండు రోజుల వ్యవధిలో తనను కలిసిన వారంతా ఐసోలేట్‌ కావాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల తన సోదరుడు, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని