కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌ 

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌,

Updated : 14 Mar 2021 11:02 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ 8 గంటలకు ప్రారంభమైంది. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది.  

సమర్థులకే ఓటేయాలి: కేటీఆర్‌
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయం పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలని కోరారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలన్నారు. విద్యావంతులు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని చెప్పారు. 
సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తాను ఓటేశానని తెలిపారు. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటేశానని కేటీఆర్‌ అన్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని