రాఖీ పంపిన మహిళకు మోదీ ధన్యవాదాలు
ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా తనకు రాఖీ పంపిన ఓ మహిళకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ రాసిన లేఖకు సామాజిక మాధ్యమాల్లో లైకులు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా తనకు రాఖీ పంపిన ఓ మహిళకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ రాసిన లేఖకు సామాజిక మాధ్యమాల్లో లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు చెందిన దీపా మటేలా జులై 28న స్పీడ్పోస్ట్ ద్వారా ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్కు ప్రత్యేకంగా రాఖీలు పంపారు. దీనికి ఆనందం వ్యక్తం చేసిన మోదీ సోదరభావంతో ప్రేమను పంచుకున్న దీపా మటేలాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఓ సందేశం కూడా రాశారు. అన్నాచెల్లెళ్లు ఒకరికొకరు రక్షగా ఉండాలని తెలిపే భారత సంస్కృతి ఎంతో గొప్పదన్న ఆయన రక్షాబంధన్ పండుగ మన మధ్య ఆప్యాయతను పెంచుతోందని అన్నారు. ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండాలని కరోనా మనకు నేర్పుతోందని మోదీ ఈ లేఖలో సందేశం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్