Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
మంకీపాక్స్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించాయి. ఇది స్మాల్పాక్స్లాగే తగ్గుతుందని చెప్పినా కొందరికి ప్రమాదకరంగా మారుతుందనే వాదన కూడా వస్తోంది. జ్వరం వచ్చి చర్మంపై నీటి బుడగలు వస్తే పాక్స్గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మంకీపాక్స్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించాయి. ఇది స్మాల్పాక్స్లాగే తగ్గుతుందని చెప్పినా కొందరికి ప్రమాదకరంగా మారుతుందనే వాదన కూడా వస్తోంది. జ్వరం వచ్చి చర్మంపై నీటి బుడగలు వస్తే పాక్స్గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. అన్ని పాక్స్ల్లో ఇదే తరహా సమస్య ఉన్నా కోతుల నుంచి వచ్చిన మంకీపాక్స్ మనుషుల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శంకరప్రసాద్ వివరించారు.
లక్షణాలు ఇవీ: జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వస్తాయి. చేతులు, పాదాల్లో దురద, పొక్కులు వస్తాయి. కళ్లు, నోరు, మల,మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, ఆరు అడుగుల దగ్గరగా ఉంటే గాలితో కూడా వస్తుంది.
ప్రాణాలు తీస్తుందా..?: ఒకరికి మంకీపాక్స్ వస్తే ఊరంత వస్తుందని చెప్పలేం. మశూచిలాగా తొందరగా వ్యాపించదు. చిన్న పిల్లలు, గర్భిణులు, వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నవారికి, బ్లడ్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ రోగులు, గుండె జబ్బులకు మందులు వాడే వారికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వంద మందిలో ముగ్గురికి ప్రాణాంతకంగా మారుతుంది. పొక్కుల్లో ఉండే నీటితోగానీ, రక్తపరీక్షతో వ్యాధిని నిర్ధారణ చేయడానికి వీలుంది.
చికిత్స ఉందా..?: చాలామందికి చికిత్స అవసరం పడకపోవచ్చు. కొంతమందికి మాత్రమే మందులు వాడాల్సి వస్తుంది. నాలుగు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. హైరిస్క్ వారికి మందులు వాడుతున్నారు. వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం రాదు. అనుమానం వస్తే పరీక్షలు చేయించుకోవాలి. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటే వ్యాధి విస్తరణ ఉండదు. మాస్క్ ధరించడం అందరికీ మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?