ఏపీలో 19,412 కేసులు.. 61 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ప్రతాపం కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరగుతోంది. వైరస్‌ బారినపడి చనిపోతున్న

Updated : 01 May 2021 19:47 IST

8వేలు దాటిన మృతుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ప్రతాపం కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరగుతోంది. వైరస్‌ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 98,214 పరీక్షలు నిర్వహించగా.. 19,412 కేసులు నిర్ధారణ కాగా.. 61 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,21,102 మంది వైరస్‌ బారినపడగా.. మరణాల సంఖ్య 8వేల మార్క్‌ దాటినట్లు  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,88,574 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో విజయనగరంలో 8 మంది; విశాఖ, చిత్తూరు, తూర్పు గోదావరిలో ఏడుగురు చొప్పున; అనంతపురంలో ఆరుగురు; ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున; నెల్లూరులో నలుగురు; గుంటూరు, కడప, శ్రీకాకుళంలో ఇద్దరేసి; పశ్చిమ గోదావరిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,053కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,579 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,82,297కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,30,752 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను పది జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని