మాతృమూర్తి.. సమయస్ఫూర్తి

టర్కీకి చెందిన ఓ మాతృమూర్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి తన నలుగురు చిన్నారుల ప్రాణాలను రక్షించుకొంది. టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది....

Published : 26 Feb 2021 23:07 IST

ఇస్తాంబుల్‌: టర్కీకి చెందిన ఓ మాతృమూర్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి తన నలుగురు చిన్నారుల ప్రాణాలను రక్షించుకొంది. టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఓ మహిళ తన నలుగురు చిన్నారులతో మంటల్లో చిక్కుకుంది. ఇంటి నుంచి బయటపడే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ నలుగురు చిన్నారులను కిటికీలోనుంచి బయటకు విసిరేసింది. అప్పటికే స్థానికులు దుప్పటిని వలలాగా పట్టుకొని కింద సిద్ధంగా ఉండటంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు మహిళకు స్వల్ప గాయాలు కాగా చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని