Viral news: ఏళ్లుగా సహజీవనం.. ఒకేసారి ముగ్గురితో పెళ్లి!

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో ఏక కాలంలో సహజీవనం చేశారో వ్యక్తి. ఇప్పుడు ఆ ముగ్గురినీ వివాహం చేసుకున్నారు. అదీ ఒకే వేడుకలో. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సమర్థ్‌ మౌర్య గతంలో...

Published : 03 May 2022 01:50 IST

భోపాల్‌: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో సహజీవనం చేశాడో వ్యక్తి. ఇప్పుడు ఆ ముగ్గురినీ వివాహం చేసుకున్నాడు. అదీ ఒకే వేదికపై. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సమర్థ్‌ మౌర్య గతంలో సర్పంచిగా పనిచేశాడు. 2003 నుంచి ఆయన ముగ్గురితో సహజీవనం చేస్తున్నాడు. ఇప్పటికే వారికి ఆరుగురు పిల్లలు. ఈ నేపథ్యంలో తాజాగా గిరిజన సంప్రదాయం ప్రకారం ఒకే వేదికపై ముగ్గురినీ పెళ్లి చేసుకున్నాడు. వారి ఆరుగురు పిల్లలూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. ఈ వ్యవహారం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ విషయమై మౌర్య మాట్లాడుతూ.. 2003లో తన మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడిందన్నాడు. 15 ఏళ్లుగా మరో ఇద్దరూ తనతో కలిసి ఉంటున్నారని  చెప్పాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 30న ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నాడు. డోలు వాయిద్యాల నడుమ గిరిజన ఆచారాల ప్రకారం మూడు రోజులపాటు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగిందని గ్రామస్థులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని