Raghurama: ఎయిమ్స్‌లో చేరిన ఎంపీ ర‌ఘురామ‌

నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణరాజు దిల్లీకి చేరుకున్నారు. తదుప‌రి చికిత్స కోసం ఆయ‌న ఎయిమ్స్‌లో చేరారు. ఈ ఉద‌యం సికింద్రాబాద్‌లోని సైనికాసుప‌త్రి నుంచి ర‌ఘురామ డిశ్చార్జి అయిన విష‌యం

Updated : 26 May 2021 15:01 IST

దిల్లీ: నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణరాజు తదుప‌రి చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఈ ఉద‌యం సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి ర‌ఘురామ డిశ్చార్జి అయిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచి ఆయ‌న నేరుగా బేగంపేట విమానాశ్రం చేరుకొని దిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్‌ చేసి గుంటూరు తరలించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన‌కు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని