విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి
విదేశాలకు వెళ్లేందుకు రెండు వారాలు అనుమతివ్వాలని కోరుతూ జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు
హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు రెండు వారాలు అనుమతివ్వాలని కోరుతూ జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోరారు. అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. విజయసాయి పిటిషన్పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. అనంతరం విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది.మరోవైపు ఓబులాపురం గనుల కేసు సీబీఐ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ లిఖితపూర్వక మెమో ఇచ్చింది. కేసు విచారణను వేగంగా చేపట్టాలని కోర్టును కోరింది. తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని ఐఏఎస్ శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రతిని సమర్పించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు