మా స్కూల్లో ఇలాంటి శిక్షలు ఉండేవి: మహీంద్రా
రెండో దశ కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న ముంబయిలో ప్రభుత్వం కఠిన నిబంధలు విధిస్తోంది. అయినా కొందరు వాటిని పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు....
ముంబయి: రెండో దశ కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న ముంబయిలో ప్రభుత్వం కఠిన నిబంధలు విధిస్తోంది. అయినా కొందరు వాటిని పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో మాస్కులు ధరించని వారితో పోలీసులు ‘డక్ వాక్’ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పోస్టు చేశారు. తాను చదివిన బోర్డింగ్ స్కూల్లో సాధారణంగా ఇలాంటి శిక్ష విధించేవారని పేర్కొన్నారు. ఆ శిక్షను ఉద్దేశించి.. ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్ మర్చిపోను అని చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా