Women’s Safety:మహిళల భద్రత కోసం నిర్భయ స్క్వాడ్లు.. ప్రభుత్వంపై నెటిజన్ల ప్రశంసలు
ముంబయి నగరంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, ఇతర నేరాలను
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి నగరంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్టీజింగ్, లైంగిక వేధింపులు, ఇతర నేరాలను నిరోధించడానికి మహిళా అధికారులతో కూడిన నిర్భయ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబయిలో 91 నిర్భయ స్క్వాడ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిచారు. ఈ బృందాల్లో ఉన్న అధికారులు ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఈ బృందాలను నగరమంతటా మోహరించారు. ఆపదలో ఉన్న మహిళలు 103 అనే హెల్ప్లైన్ నంబర్కి కాల్ చేస్తే నిర్భయ స్క్వాడ్ వెంటనే అక్కడి చేరుకుని కాపాడుతుంది. అనంతరం వేధింపులకు గురిచేసిన వారిని అరెస్ట్ చేస్తుంది. ప్రతి పోలీసు స్టేషన్లో నిర్భయ స్క్వాడ్ని ఏర్పాటు చేశారు.
ప్రతి స్క్వాడ్లో ఒక మహిళా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్, ఒక పురుష కానిస్టేబుల్తో పాటు డ్రైవర్ ఉంటారు. ఈ బృందం పెట్రోలింగ్ చేసేందుకు ప్రతి పోలీసు స్టేషన్లో ‘మొబైల్ 5’ వాహనాన్ని కేటాయించారు. నిర్భయ స్క్వాడ్లు ఎలా పనిచేస్తాయో తెలియజేసేందుకు ముంబయి పోలీసులు ఓ షార్ట్ఫిల్మ్ని రూపొందించారు. దీనికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించగా.. అమితాబ్ బచ్చన్ గాత్రదానం చేశారు. ఈ వీడియోని ముంబయి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది. మహిళల భద్రత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి పోలీసులు చూపుతున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి బృందాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు 76లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భీమవరంలో అతిరాత్ర మహోత్కృష్ట సోమయాగం: గజల్ శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మే 15 నుంచి 25 వరకు మహోత్కృష్ట సోమయాగం నిర్వహించనున్నట్టు సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హీరో విశాల్ కోరారు. ‘రత్నం’ ప్రెస్మీట్లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?