నా అందమైన నవ్వుల వెనుక ఉన్నది డాక్టర్ మోహన్: నాగార్జున
సినీ తారలకు మెరిసే దంతాలు ఎంతో అవసరమని, ఎన్నో ఏళ్లుగా తన నవ్వుల్ని దంత వైద్యుడు డాక్టర్ అట్లూరి మోహన్ అందంగా
హైదరాబాద్: సినీ తారలకు మెరిసే దంతాలు ఎంతో అవసరమని, ఎన్నో ఏళ్లుగా తన నవ్వుల్ని దంత వైద్యుడు డాక్టర్ అట్లూరి మోహన్ అందంగా ఉంచుతున్నారని సినీ నటుడు నాగార్జున అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ మోహన్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన, సాయి డెంటల్ క్లినిక్ నూతన శాఖను సతీమణి అమలతో కలిసి నాగార్జున ప్రారంభించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ‘నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు సుల్తాన్బజార్లో ఉండే వైద్యులు ఎం.ఎస్.నారాయణను సంప్రదించేవాడిని. ఆ తర్వాత ఆయన కుమారుడు మోహనే నాతో పాటు, వందల మంది సినీ నటులకు దంత వైద్యునిగా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలకు సేవల్ని విస్తరించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
తమ కుటుంబం ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేందుకు డాక్టర్ మోహన్ చూసుకుంటారని అమల తెలిపారు. అనంతరం డాక్టర్ మోహన్ మాట్లాడుతూ.. భవిష్యత్ మొత్తం డిజిటల్ డెంటిస్రీదేనని ఒక్కసారి ఆస్పత్రిని సందర్శిస్తే అధునాత సాంకేతికత ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చికిత్స అందుతుందన్నారు. వేల మందికి అందమైన చిరునవ్వులందించే బాధ్యత గత 55ఏళ్లుగా తాము చేపడుతున్నామని మోహన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?