Nagoba Jatara: నాగోబా జాతర.. గంగాజలం కోసం గోదావరికి పాదయాత్రగా ఆదివాసీలు

తెలంగాణ సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతర నాగోబా జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published : 07 Jan 2023 10:55 IST

ఇంద్రవెల్లి: తెలంగాణ సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతరైన నాగోబా జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తమ ఆరాధ్య దైవం నాగోబా దేవుడి అభిషేకానికి అవసరమైన గంగాజలం కోసం ఆదివాసీయులు గోదావరికి పాదయాత్రగా బయలుదేరారు. మంచిర్యాల జిల్లా  జన్నారం మండలంలోని కలమడుగు ప్రాంతంలోని గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు 151 మంది బయలుదేరారు. కేస్లాపూర్‌ నుంచి బయలుదేరిన భక్తులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ అటవీ ప్రాంతం నుంచి పాదరక్షలు లేకుండా ఈ నెల 10న గోదావరికి చేరుకుంటారు. అక్కడ సేకరించిన జలంతో ఈ నెల 17న తిరిగి నాగోబా సన్నిధికి చేరుకుంటారు.  జనవరి 21వ తేదీన రాత్రి 10 గంటలకు గంగాజలంతో నాగోబా దేవుడికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం మహాపూజ నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ఈ జాతర వారం రోజులపాటు జరుగుతుంది. ఆలయ పీఠాధిపతి మెస్ర వెంకట్రావు, పూజారి కోసు ప్రధాన్‌దాదేరావు సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని