Pawan Kalyan: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్‌

నటుడు నందమూరి తారకరత్న సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 27 Jan 2023 20:23 IST

హైదరాబాద్‌: నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోను కావడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘‘మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని తెలిసింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్‌ అయిందని  వైద్యులు గుర్తించారు. మిగత పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయని వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను నారా లోకేశ్‌ పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని